భద్రతా బలగాలపైకి గ్రేనేడ్ దాడి

భద్రతా బలగాలపైకి గ్రేనేడ్ దాడి

జమ్ముకాశ్మీర్ లో టెర్రరిస్టులు రెచ్చిపోయారు. శ్రీనగర్ లో గ్రేనేడ్లతో దాడికి తెగబడ్డారు. శ్రీనగర్ జిల్లాలోని హరిసింగ్ హై స్ట్రీట్ ప్రాంతంలో మంగళవారం భద్రతా బలగాలపై ఉగ్రవాదులు గ్రెనేడ్ విసిరారు. భద్రతా బలగాలను టార్గెట్ చేసుకొని వారిపైకి  ఉగ్రవా దులు గ్రెనేడ్‌తో దాడి చేసినట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఉగ్రవాదుల గ్రేనెడ్ దాడితో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా భీకరంగా మారిపోయింది. ఈ బాంబు దాడిలో నలుగురు తీవ్రంగా గాయపడినట్టు పోలీసులు తెలిపారు. బాంబు దాడి ఘటనతో స్థానికులంతా భయంతో దూరంగా పరుగులు పెట్టారు. గాయపడిన వారిలో భద్రత సిబ్బంది సహా ఇద్దరు మహిళ​లు ఉన్నారని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి భారీ ఎత్తున మోహరించారు. బాంబుదాడిలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను మెరుగైన వైద్యంకోసం సమీప ఆస్పత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి: 

 పంజాబ్ లో పర్యటించనున్న రాహుల్ గాంధీ

బీజేపీలో చేరిన ఆర్‌పీఎన్ సింగ్