కశ్మీర్ లో సోమవారం నుంచి విద్యాసంస్థలు రీఓపెన్

కశ్మీర్ లో సోమవారం నుంచి విద్యాసంస్థలు రీఓపెన్

జమ్మూకశ్మీర్ లో ఆంక్షల్ని సడలిస్తున్నారు. జమ్మూ ప్రాంతంలో ఇప్పటికే విద్యాసంస్థలు, ఆఫీసులు ప్రారంభమయ్యాయి. అక్కడ క్రమంగా 144 సెక్షన్ కూడా ఎత్తేస్తూ వస్తున్నారు. తాజాగా 2జీ ఇంటర్నెట్ సేవలను తిరిగి ప్రారంభించారు అధికారులు. దీంతో జనానికి కాస్త రిలీఫ్ దొరికింది. ఆగస్ట్ 5 నుంచి ఇంటర్నెట్ అందుబాటులో లేకుండా పోయింది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు సద్దుమణగడంతో ఒక్కొక్కటిగా సౌకర్యాలు కల్పిస్తున్నారు. అటు కశ్మీర్ లో సోమవారం నుంచి విద్యాసంస్థలను ప్రారంభించనున్నారు.