ఇయ్యాల్టి నుంచి జమ్ములమ్మ బ్రహ్మోత్సవాలు

ఇయ్యాల్టి నుంచి జమ్ములమ్మ బ్రహ్మోత్సవాలు

గద్వాల, వెలుగు: నడిగడ్డ ఇలవేల్పు జమ్ములమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ఈ నెల 24 వరకు నిర్వహించనున్నారు. ఆలయం దగ్గర అన్ని ఏర్పాట్లు  కంప్లీట్  చేశారు. మంగళవారం దివి గ్రామమైన గుర్రం గడ్డ నుంచి అమ్మవారిని తీసుకొచ్చేందుకు వెళ్తారు.

21న ఎద్దుల బండిపై ఊరేగింపుగా అమ్మవారిని జమ్ములమ్మ దేవస్థానానికి తీసుకొస్తారు. ఈ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ, ఎండోమెంట్  ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈసారి వన్ వే ఏర్పాటు చేసినట్లు ఈవో పురేందర్, ఆలయ కమిటీ చైర్మన్  గాయత్రి తెలిపారు. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత రిజర్వాయర్  పక్క నుంచి కొత్తగా రోడ్డును ఏర్పాటు చేశామని, ఆ దారి గుండా భక్తులు బయటకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.