గ్యారంటీ లేని పార్టీలను నమ్మి మోసపోవద్దు : పల్లా రాజేశ్వర్ రెడ్డి

గ్యారంటీ లేని పార్టీలను  నమ్మి మోసపోవద్దు : పల్లా రాజేశ్వర్ రెడ్డి

బచ్చన్నపేట, వెలుగు : బీఆర్​ఎస్​ అధికారంలోకి వస్తే సంక్షేమమని, కాంగ్రెస్​ వస్తే అంధకారమని, గ్యారంటీ లేని పార్టీలను  నమ్మొద్దని  జనగామ బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్​ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన బచ్చన్నపేట మండలంలోని పడమటి కేశవాపూర్​, నాగిరెడ్డి పల్లి, గంగాపూర్​, నారాయణ పూర్, నక్కవాని గూడెంలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  ఆయా గ్రామాల్లో ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి ఇంటింటి ప్రచారం చేశారు. 

 సాగు, తాగు నీరు, 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతు బీమాలను అందిస్తున్న కేసీఆర్​ ప్రభుత్వాన్ని మూడో సారి అధికారంలోకి తేవాలని కోరారు.  ప్రతీ గ్రామంలోని సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తానని అన్నారు.  జనగామ ఎమ్మెల్యేగా  గెలిపిస్తే  మరింత  అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు.  ఘట్​కేసర్​ లో తనకు చెందిన నీలిమా హాస్పిటల్​కు రేషన్ కార్డు పట్టుకుని వెళితే పైసా ఖర్చు లేకుండా వైద్యం ఉచితంగా అందిస్తామని అన్నారు. అవసరమైతే ఉచితంగా ఆపరేషన్లు కూడా చేయిస్తానన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కేసీఆర్​ను మూడో సారి ముఖ్యమంత్రిని చేయాలని కోరారు.