కేసీఆర్​ దుష్టపాలనను అంతమొందించాలె : కొమ్మూరి ప్రతాప్​ రెడ్డి

కేసీఆర్​ దుష్టపాలనను అంతమొందించాలె : కొమ్మూరి ప్రతాప్​ రెడ్డి

జనగామ, వెలుగు : సీఎం కేసీఆర్​ దుష్టపాలనకు చరమగీతం పాడాలని జనగామ జిల్లా కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్​ రెడ్డి పిలుపు నిచ్చారు.  మంగళవారం ఆయన జిల్లా కేంద్రంలోని గాయత్రీ గార్డెన్​లో మీడియాతో మాట్లాడారు.  జనగామ నియోజకవర్గం తపాస్​ పల్లి నుంచి దొడ్డి దారిన సిద్ధిపేటకు నీళ్లు తీసుకెళ్తున్నారని తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత దీనికి అడ్డుకట్ట వేస్తానని అన్నారు.  

జనగామ ప్రెస్టన్ గ్రౌండ్​లో బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు  పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డితో విజయభేరి సభ నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సభకు లక్ష మంది జనాలు హాజరుకానున్నట్లు తెలిపారు.  అంతకుముందు సభా ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన వెంట మాజీ మార్కెట్​, మున్సిపల్​ చైర్మన్​లు ఎర్రమల్ల సుధాకర్​, వేమల్ల సత్యనారాయణ రెడ్డి, లీడర్లు సీహెచ్​ శ్రీనివాస్​ రెడ్డి, బుచ్చిరెడ్డి, మేడ శ్రీనివాస్ పాల్గొన్నారు.