Janhvi Kapoor: తంగం డైలాగ్స్ వచ్చాయి..దేవర అప్డేట్ ఇచ్చిన జాన్వీ

Janhvi Kapoor: తంగం డైలాగ్స్ వచ్చాయి..దేవర అప్డేట్ ఇచ్చిన జాన్వీ

జూనియర్ ఎన్టీఆర్ (NTR) అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న మూవీ దేవర (Devara). ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న మూవీ కావడంతో నందమూరి ఫ్యాన్స్  వేయికళ్లతో ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో  హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాగా భారీ అంచనాల మధ్య ఈ చిత్రం రూపొందుతోంది.

ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 10న వరల్డ్‌‌ వైడ్‌‌గా రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తవ్వలేదని ఇంకా కొన్ని పాటల చిత్రీకరణ జరగాల్సి ఉందని జాన్వీ కపూర్ (Janhvi Kapoor) లేటెస్ట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అంతేకాకుండా 'ఇటీవలే తెలుగు డైలాగ్స్ నా దగ్గరికి వచ్చాయి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వాటిని నేర్చుకోవాలని అనుకుంటున్నా. రానున్న కొన్ని రోజుల్లో నేను ఇంగ్లిష్ మాట్లాడకుండా..కేవలం తెలుగులోనే మాట్లాడాలని అనుకుంటున్నా' అని జాన్వీ కపూర్ తెలిపింది.

ఈ మూవీలో జాన్వీ కపూర్ పల్లెటూరు అమ్మాయి తంగం క్యారెక్టర్లో నటిస్తుంది. ఇక జాన్వీ ఇచ్చిన అప్డేట్తో ఎన్టీఆర్ ఫ్యాన్స్కు కాస్తా ఉపశమనం ఇచ్చినట్టైంది. ఎందుకంటే, ఈ సినిమా రిలీజ్ పోస్ట్ ఫోన్ అవ్వడంతో ఫ్యాన్స్ కాస్తా డిస్సపాయింట్ అయ్యారు. 

రీసెంట్‌‌గా రిలీజైన దేవర గ్లింప్స్ సినిమాపై బజ్‌‌ను అమాంతం పెంచింది. అంతేకాదు..సముద్రం రక్తంతో నిండిపోయింది..ఇప్పుడు అతని ఎర్ర సముద్రం! ఈ సముద్రం చేపల్నికంటే..కత్తుల్ని,నెత్తుర్ని ఎక్కువగా చూసుండాది..అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు..అనే ఎన్టీఆర్ డైలాగ్ ఆడియన్స్ కు గూస్బంప్స్ తెప్పించాయి.

దేవరలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్‌‌గా కనిపించనున్నాడు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కళ్యాణ్ రామ్ సమర్పణలో సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.