Janhvi Kapoor: అతిలోక సుందరి పుట్టినరోజు..తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ

Janhvi Kapoor: అతిలోక సుందరి పుట్టినరోజు..తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌, అలనాటి అందాల తార దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌(Janhvi Kapoor) తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. జాన్వీ కపూర్ తన తల్లి శ్రీదేవి (Sridevi) 61 వ పుట్టినరోజు (ఆగస్ట్ 13న) సందర్భంగా తిరుపతిని సందర్శించే ఆచారాన్ని అనుసరిస్తూ శ్రీవారి దర్శనం చేసుకుంది.

తన తల్లి శ్రీదేవికి లార్డ్ బాలాజీపై విపరీతమైన భక్తి ఉండటం వల్ల తన బర్త్డే రోజు తిరుమలకి వచ్చి దర్శనం చేసుకునేది. ఈ నేపథ్యంలో ఆమె కుమార్తె జాన్వీ దానిని వారసత్వంగా తీసుకుంది. దీంతో సంవత్సరంలో చాలాసార్లు తిరుపతి ఆలయాన్ని  జాన్వీ సందర్శిస్తుంది.

నేడు తిరుమల చేరుకున్న జాన్వీకు టీటీడీ ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. జాన్వీ కపూర్ స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంది. ఆ తర్వాత జాన్వీ కపూర్ స్వామివారికి షాష్టాంగ నమస్కారం చేసింది. అచ్చమైన తెలుగమ్మాయిలా పట్టుచీరలో కనిపించి అందరినీ ఆకట్టుకుంది జాన్వీ.రంగనాయకుల మండపంలో..వేదపండితులు ఆమెకు వేదాశీర్వచనం అంద చేసి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. దర్శనానంతరం అర్చకులు ఆమెకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

అలాగే నేడుశ్రీదేవి దేవి పుట్టినరోజు సందర్బంగా ఇంస్టాగ్రామ్ లో బ్యూటీఫుల్ పిక్స్ షేర్ చేస్తూ.."హ్యాపీ బర్త్ డే అమ్మా..నేను నిన్ను ప్రేమిస్తున్నాను" అని జాన్వీ రాసింది.