భారత స్టార్ బౌలర్ జస్పిత్ బుమ్రా న్యూజిలాండ్ తో జరిగిన ఐదో టీ20లో వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. టీ20ల్లో అత్యధిక మెయిడెన్ ఓవర్లు వేసిి రికార్డులకెక్కాడు. ఇప్పటి వరకు 6 మెయిడెన్ ఓవర్లు వేసి ఫస్ట్ ప్లేస్ లో ఉన్న శ్రీలంక బౌలర్ కులశేఖర రికార్డ్ ను బుమ్రా బద్దలు కొట్టాడు . 58 టీ20లు ఆడిన కులశేఖర మొత్తం ఆరు మెయిడెన్ ఓవర్లు వేసి టోటల్ గా 66 వికెట్లు తీశాడు. 50 టీ20లు ఆడిన బుమ్రా 7 మెయిడెన్ ఓవర్లు వేసి ఇప్పటి వరకు 59 వికెట్లు తీశాడు. న్యూజిలాండ్ తో ఆదివారం జరిగిన 5వ టీ20లో బుమ్రా 3 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
see more news