న్యూఢిల్లీ: హోటళ్లు, రెస్టారెంట్లు వాడే కమర్షియల్ ఎల్పీజీ ధర భారీగా తగ్గింది. 19 కిలోల సిలిండర్ ధర ఢిల్లీలో రూ.192 తగ్గి రూ.2,738 అయింది. హైదరాబాద్లో రూ.206 తగ్గి రూ.2,985కి చేరింది. ఐదు కిలోల సిలిండర్ ధరను కూడా రూ.808.50 నుంచి రూ.762కి తగ్గించారు.
అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా చమురు కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. విమాన ఇంధన (ఏటీఎఫ్) ధర లీటరుకు రూ.ఐదు పెరిగి రూ.115 అయింది. అంతకుముందు ఇది రూ.110 ఉండేది.
గత నెల ఒకటో తేదీన కూడా కమర్షియల్ ఎల్పీజీ ధర రూ.183.5 తగ్గింది. వెస్ట్ ఏషియా సంక్షోభం కారణంగా జూన్లో ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఘర్షణలు ప్రారంభమైన తర్వాత, కమర్షియల్ ఎల్పీజీ ధర రూ.1,373 వరకు పెరిగింది. జూన్ నాటికి రూ.3113.50కి చేరింది. అయితే ఇండ్లలో వాడే సాధారణ ఎల్పీజీ ధరలను మార్చలేదని కంపెనీలు ప్రకటించాయి.
