ఏసీసీ అధ్యక్షుడిగా జైషా పదవీకాలం పొడిగింపు

ఏసీసీ అధ్యక్షుడిగా జైషా పదవీకాలం పొడిగింపు

ఆసియా క్రికెట్ కౌన్సిల్(ACC) అధ్యక్షుడిగా బీసీసీఐ కార్యదర్శి జై షా పదవీకాలంను ఏకగ్రీవంగా 2024  వరకు పొడిగించింది వార్షిక సర్వసభ్య సమావేశం (AGM). ఈ రోజు కొలంబోలో జరిగిన  ఆసియా క్రికెట్ కౌన్సిల్ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించింది బీసీసీఐ. అలాగే ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) వైస్ ప్రెసిడెంట్‌గా పంకజ్ ఖిమ్జీ, డెవలప్‌మెంట్ కమిటీ చైర్మన్‌గా మహింద వల్లిపురం నియమితులైనట్లు తెలిపింది.