నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో ఉద్రిక్తత..

నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో ఉద్రిక్తత..

జయశంకర్ భూపాలపల్లి నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకుడు సిరికొండ ప్రశాంత్ అభిమానులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. కలెక్టరేట్ ఛాంబర్ లోకి సిరికొండ ప్రశాంత్ ని వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో.. ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. 

నియోజకవర్గానికి సంబంధం లేని వారిని కలెక్టరేట్ లోకి రానిస్తున్నారు కానీ..తమ నియోజకవర్గంలో కలెక్టరేట్ కోసం పోరాడిన వారిని ఎందుకు రానివ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు సిరికొండ ప్రశాంత్ అభిమానులు.

Also Read : చీరలు వాపస్ తీసుకోలేదని ఫైన్ వేసిన్రు

జయశంకర్ భూపాలపల్లి నూతన కలెక్టరేట్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం నూతన జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించారు.