జాన్వీకపూర్ జోరు పెరిగింది

జాన్వీకపూర్ జోరు పెరిగింది

కెరీర్ ప్రారంభంలో ఎవరైనా ఒకదాని తర్వాత ఒకటిగా సినిమాలు చేసుకుంటూ వెళ్తారు. కానీ జాన్వీ మొదటి సినిమా మాత్రమే నెమ్మదిగా చేసింది. ఆ తర్వాత ఒక్కసారిగా స్పీడు పెంచేసింది. కార్గిల్ గాళ్‌‌, రూహీ అఫ్జా, తఖ్త్‌‌, దోస్తానా 2 అంటూ వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతోంది. అది చాలదన్నట్టు వెబ్‌‌ సిరీస్‌‌ వైపు కూడా అడుగులేస్తోంది. ఓ డిజిటల్‌‌ ప్లాట్‌‌ఫామ్‌‌ వాళ్లు భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్న ‘ఘోస్ట్ స్టోరీస్‌‌’లో నటించనుంది జాన్వీ. తనకెంతో ఇష్టమైన జోయా అఖ్తర్ డైరెక్టర్ కావడం వల్లే దీనికి ఎస్ చెప్పానంటోంది. విచిత్రమేమిటంటే ఆమె చేస్తున్న ప్రాజెక్టుల్లో దేనికది పూర్తి భిన్నం. ‘కార్గిల్‌‌ గాళ్’ ఒక పైలట్ బయోపిక్. జాన్వీ ద్విపాత్రాభినయం చేస్తున్న ‘రూహీ అఫ్జా’ హారర్‌‌‌‌ కామెడీ. ‘తఖ్త్’ చారిత్రాత్మక చిత్రం. ‘దోస్తానా 2’ రొమాంటిక్ మూవీ. ‘ఘోస్ట్‌‌ స్టోరీస్‌‌’ సీరియస్ హారర్ జానర్‌‌‌‌లో రూపొందుతుంది. ఇలా దేనికది డిఫరెంట్‌‌గా ఉండేలా జాగ్రత్త పడుతూ జోరుగా సాగిపోతోంది జాన్వీ. కెరీర్‌‌‌‌ని అత్యంత తెలివిగా ప్లాన్ చేసుకుంటూ తల్లికి తగ్గ కూతురనిపించుకుంటోంది.