కాంగ్రెస్ లో చేరిన జిట్టా బాలకృష్ణారెడ్డి

కాంగ్రెస్ లో చేరిన జిట్టా బాలకృష్ణారెడ్డి

 ఎంపీ  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమక్షంలో జిట్టా బాలక్రిష్ణా రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.  ఈ సందర్భంగా మాట్లాడిన  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి .. జిట్టా బాలక్రిష్ణా రెడ్డిని మనస్ఫూర్తిగా కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నానని చెప్పారు. టీఆర్ఎస్   పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ వెంట ఉన్న కొద్ది మందిలో జిట్టా ఒకరని చెప్పారు.    ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 సీట్లు గెలుస్తామని అన్నారు. 

సెప్టెంబర్ 17న తుక్కుగుడా సభకు 10 లక్షలకు పైగా జనం వస్తారని కోమటిరెడ్డి చెప్పారు. తెలంగాణ కోసం పదవులను త్యాగం చేశానన్నారు.  తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేచడమే కాంగ్రెస్ లక్ష్యమని తెలిపారు.  కేసీఆర్ దళిత బంధు పేరుతో బీఆర్ఎస్ కార్యకర్తలకు దోచి పెడుతున్నారని చెప్పారు.  కేసీఆర్ లాగా మాయమాటలు చెబితే తాము 2014లొనే అధికారంలోకి వచ్చేవాళ్లమన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

ALSO READ: తుమ్మల రాజీనామా.. సీఎం కేసీఆర్ కు లేఖ

తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకే సోనియా తెలంగాణ ఇచ్చారన్నారు జిట్టా బాలకృష్ణారెడ్డి. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రజల తుకులు మారలేదన్నారు.  ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్నారు. కేసీఆర్ సర్కార్ ను బొందపెట్టాలంటే  కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుందన్నారు. ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడం కోసం  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమక్షంలో పనిచేస్తామన్నారు.