న్యూఢిల్లీ: హీటింగ్ ఎక్విప్మెంట్లను తయారు చేసే జేఎన్కే ఇండియా లిమిటెడ్ ఈ నెల 23 న ఐపీఓకి వస్తోంది. కంపెనీ పబ్లిక్ ఇష్యూ 25 న ముగుస్తుంది. ఒక్కో షేరును రూ.395–415 రేంజ్లో అమ్ముతున్నారు.
ఈ నెల 22 న యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి ఫండ్స్ సేకరించనుంది. ఐపీఓ ద్వారా రూ.650 కోట్లను సేకరించాలని జేఎన్కే ఇండియా చూస్తోంది. ఫ్రెష్ షేర్లను ఇష్యూ చేయడం ద్వారా రూ.300 కోట్ల వరకు సేకరించనుంది.