ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్​కు జేఎన్టీయూ రిజిస్ట్రార్

ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్​కు జేఎన్టీయూ రిజిస్ట్రార్

హైదరాబాద్, వెలుగు: వచ్చే నెల 10 నుంచి 12 వరకు స్మార్ట్ మొబిలిటీ అండ్ వెహికల్ ఎలక్ట్రిఫికేషన్​పై అమెరికాలో జరిగే అంతర్జాతీయ సదస్సుకు జేఎన్టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూరు హుస్సేన్​ ఎంపికయ్యారు. ఈ మేరకు యూఎస్ఏ ఐఈవోఎం సొసైటీ ఆయనకు గురువారం సమాచారం అందించింది. ఈ సదస్సుకు వివిధ దేశాల నుంచి 15 మంది స్పీకర్లను ఎంపిక చేయగా అందులో మనదేశం నుంచి హుస్సేన్ ఒక్కరే కావడం గమనార్హం. 

సదస్సులో రీసెర్చ్ పేపర్​ను సబ్మిట్ చేయనున్నట్లు మంజూరు హుస్సేన్ తెలిపారు. ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్​ వెహికల్స్ వాడకాన్ని ప్రోత్సహిస్తున్నందున దీనిపై అనేక రీసెర్చ్​లు జరుగుతున్నాయని వివరించారు. ఎలక్ట్రిక్ వెహికల్స్​కు చార్జింగ్ పెట్టడం సమస్యగా మారిందని, ఈ సమస్యను ఎలా పరిష్కరించాలనే దానిపై సమావేశంలో చర్చించనున్నట్టు చెప్పారు. బండి రోడ్డుపై నడుస్తున్నప్పుడే రీచార్జ్ అయ్యేటట్టు ఉండాలనే దానిపై పరిశోధనలు జరుగుతున్నాయన్నారు.