ఢిల్లీలోని జేఎన్యూ లో విద్యార్ధులు, అధ్యాపకులపై జరిగిన దాడి ఘటనకి సంబంధించి ఇంతవరకూ నిందితులు ఎవరనేది తెలియలేదు. ఈ దాడి మా కార్యకర్తలే చేశారంటూ.. హిందూ రక్షా దళ్ సంస్థ చీఫ్ పింకీ చౌదరీ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. పథకం ప్రకారమే ఈ దాడి జరిగి ఉండొచ్చని ఢిల్లీ పోలీసులు అభిప్రాయ పడుతున్నారు.
ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ దాడిలో పాల్గొన్న నిందితులను గుర్తించడం కష్టంగా మారిందని అన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సీసీ టీవీ సర్వర్ పాడవడం వల్ల ఎవరూ దాడి చేశారనే విషయం తేల్చుకోలేకపోతున్నామన్నారు. ఈ నెల 3 నే సర్వర్ డామేజ్ అయిందని.. ఘటన 5 వ తేదిన జరిగిందని చెప్పారు.
దాడికి సంబంధించి సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్న వాట్సాప్ స్క్రీన్ షాట్లను పరిగణనలోకి తీసుకున్నామని, నంబర్లను కూడా గుర్తించామని చెప్పారు. కానీ ప్రస్తుతం ఆ మొబైల్స్ చాలా వరకూ స్విచ్ ఆఫ్ చేయబడి ఉన్నాయన్నారు పోలీసులు.