
నార్త్ ఈస్ట్ రాష్ట్రాలను ఇండియా నుంచి విడగొట్టేద్దాం ’ అంటూ వివాదాస్పద కామెంట్స్ చేసిన జేఎన్యూ స్కాలర్ షర్జీల్ ఇమామ్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కా డు. బీహార్ జెహనాబాద్ జిల్లాలోని తన పూర్వీకుల ఇంట్లో దాక్కున్న షర్జీల్ను మంగళవారం అదుపులోకి తీసుకున్నట్లు డీజీపీ గుప్తేశ్వర్ పాండే చెప్పారు. షర్జిల్ను కోర్టులో హాజరు పరిచి, రిమాండ్ కు అప్పగించాలని కోరనున్నట్లు సమాచారం. అయితే, షర్జిల్ ను బీహార్లో ప్రశ్నిస్తారా.. లేక ఢిల్లీకి తరలించి అక్కడ ప్రశ్నిస్తారా అనే విషయంలో పోలీసులు క్లారిటీ ఇవ్వలేదు. యాంటీ సీఏఏ ఆందోళనలలో భాగంగా వివాదాస్పద కామెంట్స్ చేసిన షర్జిల్ పై పోలీసులు దేశ ద్రోహం కేసు నమోదు చేశారు. దీంతో షర్జీల్ కొన్ని రోజులుగా పోలీసులను తప్పించుకు తిరుగుతున్నాడు. ఉత్తరప్రదేశ్, అస్సాం , మణిపూర్, అరుణాచల్ప్రదేశ్, ఢిల్లీ పోలీసులు అతడికోసం గాలిస్తున్నారు.ఈ క్రమంలో మంగళవారం బీహార్ పోలీసులకు తానే లొంగిపోయానని షర్జిల్ చెబుతుండగా.. వెతికిపట్టుకుని, అరెస్ట్ చేశామని పోలీసులు అంటున్నారు.
ఎవరీ షర్జిల్ ఇమామ్?
- 32 ఏళ్ల షర్జిల్ జేఎన్యూలో పీహెచ్ డీ స్కాలర్
- ముంబై ఐఐటీ నుంచి డిగ్రీ పట్టా పుచ్చుకున్నడు
- జామియా మిలియా యూనివర్సిటీ దగ్గర రెచ్చగొట్టే కామెంట్స్ చేశారనే ఆరోపణలున్నాయి.
షర్జిల్ ఏమన్నడంటే..
సీఏఏ వ్యతిరేక ఆందోళనలలో భాగంగా షర్జిల్ ఈ నెల 16 న అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో మాట్లాడాడు. సీఏఏను వ్యతిరేకించాలని పిలుపునివ్వడంతో పాటు రెచ్చగొట్టే కామెంట్స్ చేశాడు. ‘ఐదు లక్షల మంది కనుక ఒక్కటైతే నార్త్ ఈస్ట్ రాష్ట్రాలను ఇండియా నుంచి శాశ్వతంగా విడదీయొచ్చు. పర్మినెంట్గా కాకపోయినా కనీసం నెలా రెండు నెలల పాటు రైళ్లను, రోడ్లను మూసేస్తే చాలు. అస్సాంను విడగొట్టడం మన బాధ్యత. అప్పుడు కానీ వాళ్లుమన మాట వినరు. అస్సాంలో ముస్లింల పరిస్థితి ఎలా ఉందో మనకు తెలుసు.. వాళ్లం దరినీ డిటెన్షన్ క్యాంపుల్లో పెడతారు’ అని అన్నాడు.ఐదు రాష్ట్రాల్లో దేశద్రోహం కేసులు నమోదు-కావడం, పోలీసులు గాలిస్తుండడంతో షర్జిల్ తప్పించుకు తిరుగుతున్నాడు.