పరారీలోఉన్న JNU స్టూడెంట్ అరెస్ట్

పరారీలోఉన్న JNU స్టూడెంట్ అరెస్ట్

నార్త్​ ఈస్ట్​ రాష్ట్రాలను ఇండియా నుంచి విడగొట్టేద్దాం ’ అంటూ వివాదాస్పద కామెంట్స్​ చేసిన జేఎన్​యూ స్కాలర్ షర్జీల్ ఇమామ్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కా డు. బీహార్ ​జెహనాబాద్ జిల్లాలోని తన పూర్వీకుల ఇంట్లో దాక్కున్న షర్జీల్​ను మంగళవారం అదుపులోకి తీసుకున్నట్లు డీజీపీ గుప్తేశ్వర్​ పాండే చెప్పారు. షర్జిల్​ను కోర్టులో హాజరు పరిచి, రిమాండ్ కు అప్పగించాలని కోరనున్నట్లు సమాచారం. అయితే, షర్జిల్ ను బీహార్​లో ప్రశ్నిస్తారా.. లేక ఢిల్లీకి తరలించి అక్కడ ప్రశ్నిస్తారా అనే విషయంలో పోలీసులు క్లారిటీ ఇవ్వలేదు. యాంటీ సీఏఏ ఆందోళనలలో భాగంగా వివాదాస్పద కామెంట్స్​ చేసిన షర్జిల్ పై పోలీసులు దేశ ద్రోహం కేసు నమోదు చేశారు. దీంతో షర్జీల్ కొన్ని రోజులుగా పోలీసులను తప్పించుకు తిరుగుతున్నాడు. ఉత్తరప్రదేశ్, అస్సాం , మణిపూర్, అరుణాచల్​ప్రదేశ్, ఢిల్లీ పోలీసులు అతడికోసం గాలిస్తున్నారు.ఈ క్రమంలో మంగళవారం బీహార్ పోలీసులకు తానే లొంగిపోయానని షర్జిల్ చెబుతుండగా.. వెతికిపట్టుకుని, అరెస్ట్​ చేశామని పోలీసులు అంటున్నారు.

ఎవరీ షర్జిల్ ఇమామ్?

  • 32 ఏళ్ల షర్జిల్​ జేఎన్​యూలో పీహెచ్ డీ స్కాలర్
  • ముంబై ఐఐటీ నుంచి డిగ్రీ పట్టా పుచ్చుకున్నడు
  • జామియా మిలియా యూనివర్సిటీ దగ్గర రెచ్చగొట్టే కామెంట్స్ చేశారనే ఆరోపణలున్నాయి.

షర్జిల్ ఏమన్నడంటే..

సీఏఏ వ్యతిరేక ఆందోళనలలో భాగంగా షర్జిల్ ఈ నెల 16 న అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో మాట్లాడాడు. సీఏఏను వ్యతిరేకించాలని పిలుపునివ్వడంతో పాటు రెచ్చగొట్టే కామెంట్స్​ చేశాడు. ‘ఐదు లక్షల మంది కనుక ఒక్కటైతే నార్త్ ​ఈస్ట్​ రాష్ట్రాలను ఇండియా నుంచి శాశ్వతంగా విడదీయొచ్చు. పర్మినెంట్​గా కాకపోయినా కనీసం నెలా రెండు నెలల పాటు రైళ్లను, రోడ్లను మూసేస్తే చాలు. అస్సాంను విడగొట్టడం మన బాధ్యత. అప్పుడు కానీ వాళ్లుమన మాట వినరు. అస్సాంలో ముస్లింల పరిస్థితి ఎలా ఉందో మనకు తెలుసు.. వాళ్లం దరినీ డిటెన్షన్​ క్యాంపుల్లో పెడతారు’ అని అన్నాడు.ఐదు రాష్ట్రాల్లో దేశద్రోహం కేసులు నమోదు-కావడం, పోలీసులు గాలిస్తుండడంతో షర్జిల్​ తప్పించుకు తిరుగుతున్నాడు.