జోగిపేట, వెలుగు: జోగిపేట ప్రభుత్వ హాస్పిటల్ను కలెక్టర్ ప్రావీణ్య మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిజిస్టర్ చెక్ చేయగా 11 మంది వైద్యులు గైర్హాజరు కావడం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 11 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని డీసీహెచ్ను ఆదేశించారు. విధులపట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చిరించారు.
