అలంపూర్, వెలుగు: జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయ పార్కింగ్ వేలం పాట ద్వారా రూ.79.25 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈవో దీప్తి తెలిపారు. హైదరాబాద్లోని దేవాదాయ శాఖ కమిషనర్ ఆఫీస్లో సీల్డ్, ఆన్ లైన్, బహిరంగ వేలంలో హైదరాబాద్ కు చెందిన సురేశ్ కుమార్ పార్కింగ్ నిర్వహణను దక్కించుకున్నారు.
గత ఏడాది కంటే రూ.9.25 లక్షల ఆదాయం అదనంగా వచ్చినట్లు ఈవో తెలిపారు. టెంకాయలు, పూజా సామాగ్రి అమ్మకం, చీరల నిర్వహణకు సంబంధించిన వేలం పాటను వాయిదా వేసినట్లు చెప్పారు.
