జాన్ అబ్రహాం దంపతులకు కరోనా పాజిటివ్

జాన్ అబ్రహాం దంపతులకు కరోనా పాజిటివ్

భారత్ లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇందులో ముఖ్యంగా  బాలీవుడ్ ప్రముఖులు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా హీరో జాన్ అబ్రహాం, ఆయన భార్య ప్రియా రంచాల్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని జాన్ అబ్రహాం ఇన్స్టాగ్రామ్ ద్వారా  తెలిపారు.

మూడు రోజుల క్రితం తాను ఒక వ్యక్తిని కలిశానని... ఆయనకు కరోనా ఉందనే విషయం తనకు తర్వాత తెలిసిందని చెప్పారు జాన్. లేటెస్టుగా  తనకు, ప్రియాకు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిందని తెలిపారు. ప్రస్తుతం తాము ఇంట్లోనే క్వారంటైన్ లో ఉన్నామని... ఎవరినీ కలవడం లేదని చెప్పారు. తామిద్దరం రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, తప్పకుండా మాస్క్ ధరించాలని చెప్పారు.

మరిన్ని వార్తల కోసం..

బండి సంజయ్ పై బెయిలబుల్ కేసు