ప్రధాని మోడీకి కృతజ్ఞతలు : జేపీ నడ్డా

ప్రధాని మోడీకి  కృతజ్ఞతలు : జేపీ నడ్డా

బీజేపీ జాతీయ అధ్యక్షులుగా తన పదవీకాలాన్ని పొడిగిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకోవడం పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోడీకి, జాతీయ కార్యవర్గ సభ్యులకు జేపీ నడ్డా కృతజ్ఞతలు తెలిపారు. మోడీ నాయకత్వంలో కలిసి లోక్‌సభ ఎన్నికల్లో మూడింట రెండు వంతుల మెజారిటీతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ట్వీట్ చేశారు. పేదల సంక్షేమమే తమ సంకల్పం అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు. 

బీజేపీ జాతీయ అధ్యక్షులుగా జేపీ నడ్డా పదవీకాలన్ని పొడిగిస్తూ ఇవాళ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. లోక్ సభ ఎన్నికల వరకు నడ్డా పార్టీ అధ్యక్షులుగా కొనసాగుతారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. నడ్డా అధ్యక్షతనే 2024 ఎన్నికల్లో పోటీకి వెళ్తామని స్పష్టం చేశారు.  ఈ నెల 20న నడ్డా పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నిర్ణయం మేరకు నడ్డా 2024 జూన్ వరకు బీజేపీ జాతీయ అధ్యక్షులుగా కొనసాగనున్నారు.