
దేవర తర్వాత వరుస సినిమాలతో.. బిజీ షెడ్యూల్ లో ఉన్నారు ఎన్టీఆర్. హృతిక్ రోషన్ తో వార్-2 సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ కావడానికి వచ్చింది. అయితే గాయం కారణంగా హృతిక్ కొన్నాళ్లు షూటింగ్ కు దూరంగా ఉండగా.. చివరి షెడ్యూల్ ను స్టార్ట్ చేశారు. ఈ సినిమాలో హృతిక్ కు వ్యతిరేకంగా పవర్ ఫుల్ రోల్ లో నటిస్తుండటంతో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెచేసుకున్నారు.
గురువారం (జూన్ 26) వార్ చివరి షెడ్యూల్ లో నటించేందుకు ముంబైలో ల్యాండ్ అయ్యారు ఎన్టీఆర్. చివరి షెడ్యూల్ కావడంతో భార్య లక్ష్మీ ప్రసన్నతో పాటు పిల్లలను కూడా తీసుకెళ్లారు. ఫ్యామిలీతో పాటు ముంబై వెళ్లిన ఎన్టీఆర్.. చేతిలో బుక్ పట్టుకుని కనిపించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ బుక్ ఏంటా అని ఫ్యాన్స్ సర్చ్ చేస్తు్న్నారు.
వార్-2 కంప్లీట్ అవుతున్న సందర్భంగా నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ముందు నుంచే ప్రిపరేషన్స్ మొదలుపెట్టారు ఎన్టీఆర్. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో పౌరాణిక చిత్రంలో నటించనున్న విషయం తెలిసిందే. కార్తికేయ, సుబ్రహ్మణ్య స్వామి అని పిలుచుకునే కుమారస్వామి చరిత్రకు సంబంధించిన భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నారు. అందుకోసం మురుగన్ చరిత్రను ఎక్కడికి వెళ్లినా తీసుకెళ్తున్నాడు.
జనరల్ గా ఎన్టీఆర్ ఏ సినిమా చేస్తున్నా.. ఆ క్యారెక్టర్ కు సంబంధించి పూర్తిగా ఇన్వాల్వ్ అవుతుంటాడు. దానికి సంబంధింది ముందునుంచే ప్రిపరేషన్స్ రెడీ చేసుకుంటుంటాడు. అయితే మురుగన్ చరిత్ర మొత్తం ఔపోసన పడితే క్యారెక్టర్ లోకి మరింత డీప్ గా వెళ్లొచ్చునని అధ్యయనం చేస్తున్నారు. అందుకే మురుగన్ చరిత్రను క్యారీ చేస్తున్నారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.