- రూ.20 వేలు క్యాష్ ట్రాన్స్ఫర్చేశామని ఉడాయింపు
జూబ్లీహిల్స్, వెలుగు: అత్యవసరంగా డబ్బులు అవసరం ఉన్నాయని ఓ వ్యక్తి దగ్గర రూ.20 వేలు తీసుకుని, ఫోన్పేలో డబ్బులు ట్రాన్స్ఫర్చేశామని చూపించి ఉడాయించారు. మొఘల్పురాకు చెందిన వహీమ్ అహ్మద్ ఖాన్ ఈ నెల 20న టోలిచౌకిలోని అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. డబ్బుల కోసం షేక్పేట్లోని కరాచీ బేకరీ సమీపంలోని ఏటీఎం వద్దకు వెళ్లాడు. అప్పుడే ఓ గుర్తుతెలియని వ్యక్తి వచ్చి కారులో తన కుటుంబం ఎదురుచూస్తోందని, తనకు అర్జెంటుగా రూ.20 వేలు కావాలని, ఫోన్పే చేస్తానని చెప్పాడు. అతడిని నమ్మిన వహీమ్డబ్బులు ఇచ్చాడు.
దీంతో సదరు వ్యక్తి ఫేక్ ఫోన్ పే యాప్ లో వహీమ్ నెంబర్ ఎంటర్ చేసి నగదు ట్రాన్స్ఫర్ చేసినట్టు చూపించి అక్కడనుండి వెళ్లిపోయాడు. తర్వాత అకౌంట్లోకి డబ్బులు రాకపోవడంతో ఫిల్మ్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సీసీ కెమెరాలు, బండి నంబర్ ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు నిందితుడిని బండ్లగూడ వాధియో ఫరాన్ కాలనీ, చాంద్రాయణగుట్టకు చెందిన మహమ్మద్ మక్తదర్ రెహమాన్ (23), మహ్మద్ అకిఫ్ (21) గా గుర్తించి అరెస్ట్ చేశారు.

