
హైదరాబాద్, వెలుగు: కొత్తగా నియమితులైన జూనియర్ లెక్చరర్లకు విడతలవారీగా ట్రైనింగ్ ఇవ్వాలని ఇంటర్మీడియెట్ కమిషనరేట్ నిర్ణయించింది. దీంట్లో భాగంగా ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ లెక్చరర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. ఎంసీహెచ్ఆర్డీ లో వంద మందికి రెండు బ్యాచ్లుగా ట్రైనింగ్ ఇస్తారు. ఒక్కో సబ్జెక్ట్కు 3 రోజుల చొప్పున అధికారులు షెడ్యూల్ తయారు చేశారు. వారికి అకాడమిక్ తోపాటు సర్వీస్ అంశాలపై అవగాహన కల్పించనున్నారు.