9 నుంచి కొత్త జేఎల్స్​కు ట్రైనింగ్

9 నుంచి కొత్త జేఎల్స్​కు ట్రైనింగ్

హైదరాబాద్, వెలుగు: కొత్తగా నియమితులైన జూనియర్ లెక్చరర్లకు విడతలవారీగా ట్రైనింగ్ ఇవ్వాలని ఇంటర్మీడియెట్ కమిషనరేట్ నిర్ణయించింది. దీంట్లో భాగంగా ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్​ లెక్చరర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. ఎంసీహెచ్ఆర్డీ లో వంద మందికి రెండు బ్యాచ్​లుగా ట్రైనింగ్ ఇస్తారు. ఒక్కో సబ్జెక్ట్​కు 3 రోజుల చొప్పున అధికారులు షెడ్యూల్ తయారు చేశారు. వారికి అకాడమిక్ తోపాటు సర్వీస్ అంశాలపై అవగాహన కల్పించనున్నారు.