నకిరేకల్, వెలుగు : కాంగ్రెస్తోనే బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి చెప్పారు. నల్గొండ జిల్లా నకిరేకల్లో బుధవారం జరిగిన మీటింగ్లో ఆయన మాట్లాడారు. భువనగిరి కాంగ్రెస్ క్యాండిడేట్కు మెజార్టీ ఇచ్చే విషయంలో నకిరేకల్, మునుగోడు నియోజకవర్గ లీడర్లు పోటీ పడాలని సూచించారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ పార్టీని గద్దె దించే వరకు కష్టపడ్డానని చెప్పారు. దేశానికి కాంగ్రెస్ పార్టీ శ్రీరామ రక్ష అన్నారు. నకిరేకల్ నియోజకవర్గంలో తాను గతంలో గెలిపించిన ఎమ్మెల్యే అమ్ముడుపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, డిప్యూటీ మాజీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, కాంగ్రెస్ నాయకులు కొండేటి మల్లయ్య, దైద రవీందర్, డీసీసీ అధ్యక్షుడు శంకర్నాయక్, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శంభయ్య, చామల శ్రీనివాస్, ఎంపీపీ శ్రీదేవి గంగాధర్ రావు పాల్గొన్నారు.