పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేషన్ కు వచ్చే మహిళలకి న్యాయం చేయాలి : ఎస్పీ డి. జానకి   

పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేషన్ కు వచ్చే మహిళలకి న్యాయం చేయాలి : ఎస్పీ డి. జానకి   

పాలమూరు, వెలుగు: మహిళలు పోలీస్ స్టేషన్ కు రావడానికి ఎంతో  ధైర్యం కావాలని పోలీసులు వారి పట్ల  పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని  మహబూబ్ నగర్ ఎస్పీ డి. జానకి పోలీసులకు సూచించారు.  గురువారం జిల్లా కేంద్రంలోని మహిళా పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేశారు. మహిళల భద్రత  విషయంలో వేగంగా స్పందించాలని ఆదేశించారు.   ఎస్పీ మాట్లాడుతూ..   షీ టీం బృందాలు  స్కూల్, కాలేజీల వద్ద  గస్తీని పెంచాలని  వేధింపులకు గురి చేసే వారిని గుర్తించి  చర్యలు తీసుకోవాలని అన్నారు.