
హైదరాబాద్, వెలుగు: కృష్ణా నదీ జలాల కేటాయింపునకు సంబంధించి బ్రజేష్ ట్రిబ్యునల్ కు విధి విధానాలు ఖరారు చేస్తూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం హర్షణీయమని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ, ఆ పార్టీ తమిళనాడు కో ఇన్ చార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. కృష్ణా జలాల కేటాయింపులో తెలంగాణకు న్యాయమైన వాటా 575 టీఎంసీలు రావాల్సి ఉండగా, సీఎం కేసీఆర్ సర్కార్ కేవలం 299 టీఎంసీలకే అంగీకరించిందని ఆయన ఫైర్ అయ్యారు. కేంద్రం నిర్ణయంతో ఉమ్మడి పాలమూరు, నల్గొండ జిల్లాలకు న్యాయం జరుగుతుందని, ఖమ్మం జిల్లా చివరి ఆయకట్టుకూ నీరు అందే అవకాశం ఉంటుందని ఓ ప్రకటనలో తెలిపారు.