
చైనాలో జరుగుతోన్న ఏషియన్ గేమ్స్ లో భారత్ కు మరో రెండు స్వర్ణాలు లభించాయి. పురుషుల కాంపౌండ్ ఆర్చరీలో ఓజాస్ ప్రవీణ్ కు స్వర్ణం దక్కగా, మహిళల పురుషుల కాంపౌండ్ ఆర్చరీలో జ్యోతి సురేఖ వెన్నమ్కు స్వర్ణం లభించింది.
149 – 145 తోయ కొరియన్ క్రీడాకారిణి చేవాన్ సోపైను ఓడించి స్వర్ణం సాధించింది. దీంతో మొత్తంగా ఈ ఆసియా క్రీడల్లో మూడు స్వర్ణ పతకాలు జ్యోతి ఖాతాల్లో చేరాయి. కాంపౌండ్ ఇండివిడ్యువల్, కాంపౌండ్ ఉమెన్ టీమ్, కాంపౌండ్ మక్స్ డ్ టీమ్ విభాగాల్లో మెడల్స్ సాధించింది.
కాగా ఆర్చరీలో అభిషేక్ వర్మకు రజిత పతకం దక్కగా, అధితి గోపీచంద్ కు కాంస్యపతకం లభించింది. దీంతో ఇప్పటివరకు భారత్ గెలుచుకున్న పతకాల సంఖ్య 100కి చేరింది. ఇందులో స్వర్ణం- 25 రజతం- 35 కాంస్యం- 40 పతకాలు ఉన్నాయి.