
హైదరాబాద్, వెలుగు: పాకిస్తాన్తో యుద్ధం, పహల్గాం ఘటనలపై రాహుల్ అడిగిన ప్రశ్నలకు ప్రధాని మోదీ, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ సమాధానం చెప్పాలని ప్రభుత్వ సలహాదారు కే.కేశవ రావు డిమాండ్ చేశారు. శుక్రవారం బంజారాహిల్స్ లోని తన నివాసంలో కేకే మీడియాతో మాట్లాడారు.
ఇండియా, పాక్ మధ్య ఆరు సార్లు యుద్ధం జరిగిందని, పహల్గాం ఘటన తర్వాత మన దేశం ఏదో చేస్తున్నట్లు క్రియేట్ చేశారే తప్ప ఏమీ జరగలేదన్నారు. సీజ్ ఫైర్ కు, ట్రంప్ కు ఏం సంబంధమని, రెండు దేశాల మధ్యవర్తిగా ఉండడానికి ట్రంప్ ఎవరని ప్రశ్నించారు. జైహింద్ ర్యాలీలో సీఎం రేవంత్రెడ్డి దేశం గర్వించేలా మాట్లాడారని కొనియాడారు.