కేసీఆర్ రైతులే నిన్ను గద్దె దింపుతరు : కేఏ పాల్

కేసీఆర్ రైతులే నిన్ను గద్దె దింపుతరు : కేఏ పాల్

కామారెడ్డి అభివృద్ధి పేరుతో ప్రభుత్వం తీసుకొచ్చిన మాస్టర్ ప్లాన్ దుర్మార్గంగా ఉందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. బాధిత రైతులకు మద్దతుగా ఆయన కోర్టు విచారణకు హాజరయ్యారు. మాస్టర్ ప్లాన్ పేరుతో రైతులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్న కేసీఆర్ను అన్నదాతలే గద్దె దింపుతారని అన్నారు. మాస్టర్ ప్లాన్ కేసులో పార్టీ ఇన్ పర్సన్ గా పిటిషన్ వేసి వాదనలు వినిపిస్తానని కేఏ పాల్ స్పష్టం చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతానన్న ఆయన.. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తానని తేల్చిచెప్పారు.

ఇదిలా ఉంటే కామారెడ్డి మాస్టర్ ప్లాన్ను వ్యతిరేకిస్తూ బాధిత రైతులు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు మాస్టర్ ప్లాన్ ఫైనల్ చేయొద్దని స్పష్టం చేసింది. కేసును మధ్యాహ్నానికి పాస్ ఓవర్ చేసిన న్యాయమూర్తి అడ్వకేట్ జనరల్ను విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.