కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరో నాకు తెలియదు : కేఏ పాల్

కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరో నాకు తెలియదు : కేఏ పాల్

కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఎవరో నాకు తెలియదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. కాంగ్రెస్ పని అయిపోయిందని, అందుకే హుజూరాబాద్ లో ఆ పార్టీకి 3లక్షల ఓట్లకు 3 వేల ఓట్లు పడ్డాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలవదని అందరికీ తెలుసన్న పాల్.. బీజేపీ తెలంగాణలో ఎక్కడా లేదని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో తుడిచిపెట్టుకుపోయినందునే బీఆర్ఎస్ పేరుతో జాతీయ పార్టీ పెట్టారని చెప్పారు.ఇప్పుడున్న పార్టీలన్నీ రెండు మూడు కుటుంబాలు, కులాలకే పరిమితమయ్యాయని పాల్ విమర్శించారు. 90 శాతం ప్రజలు తనకు సపోర్ట్ గా ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు.