కాకా క్రికెట్ టోర్నీ.. నియోజకవర్గ స్థాయి టాపర్ బెల్లంపల్లి..

కాకా క్రికెట్ టోర్నీ.. నియోజకవర్గ స్థాయి టాపర్ బెల్లంపల్లి..

కోల్​బెల్ట్, వెలుగు : కాకా వెంకటస్వామి స్మారక బెల్లంపల్లి నియోజకవర్గస్థాయి క్రికెట్​పోటీల్లో బెల్లంపల్లి జట్టు 10 పాయింట్లతో టాపర్​గా నిలిచింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని ఏఎంసీ-2 గ్రౌండ్​లో ఆదివారం బెల్లంపల్లి, కాసీపేట టీమ్ ల మధ్య చివరి మ్యాచ్ జరిగింది. టాస్​గెలిచి బ్యాటింగ్​ఎంచుకున్న కాసీపేట జట్టు 16 ఓవర్లలో 115 రన్స్ చేసి ఆలౌట్​అయ్యింది. బౌలర్​కుమార్​4 వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్​చేసిన బెల్లంపల్లి జట్టు ఒకే ఒక్క వికెట్​కోల్పోయి 13 ఓవర్లలోనే టార్గెట్​ఛేజ్​చేసింది.

ఈ గెలుపుతో బెల్లంపల్లి టీమ్ నియోజకవర్గస్థాయి టాపర్​గా నిలిచింది. జట్టుకు చెందిన సాయి 43 బాల్స్​లో 83 రన్స్​తో నాటౌట్ గా నిలిచి ప్లేయర్​ఆఫ్​ది మ్యాచ్ దక్కించుకున్నాడు. ఈ నెల 4 నుంచి జరుగుతున్న కాకా వెంకటస్వామి స్మారక నియోజకవర్గ స్థాయి క్రికెట్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. పోటీ ఆర్గనైజర్​గా మత్తమారి శశికాంత్​ వ్యవహరించగా అంపైర్లుగా తండూరి శ్రీనివాస్, గజ్జె దుర్గయ్య పనిచేశారు. 

చెన్నూరు టైగర్స్ విక్టరీ

రామకృష్ణాపూర్ సింగరేణి ఠాగూర్​స్టేడియంలో ఆదివారం కాకా వెంకటస్వామి స్మారక చెన్నూరు నియోజకవర్గస్థాయి క్రికెట్​పోటీల్లో చెన్నూరు టైగర్స్, జైపూర్ జాగూర్స్ టీమ్ లు తలపడ్డాయి. చెన్నూరు టైగర్స్​జట్టుకు చెందిన మిర్జా అదీబ్​అహ్మద్​ 81 బాల్స్ లో 12 ఫోర్లు, 2 సిక్స్ లతో 92 పరుగులు చేయగా, బొడ్డు సురేందర్​37 బాల్స్ లో 7 ఫోర్లు, 3 సిక్స్ లతో 64 రన్ చేయడంతో పాటు సాయిచంద్ 27 పరుగులు చేశాడు. దీంతో ఆ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 202 స్కోర్​చేసింది. అనంతరం బ్యాటింగ్ కు​ దిగిన జైపూర్​ జాగూర్స్​ టీం 19 ఓవర్లలో 88 రన్స్​చేసి అలౌట్ అయ్యింది.

దీంతో చెన్నూరు టైగర్స్​ జట్టు 114 రన్స్​తేడా విక్టరీ సాధించింది. 92 రన్స్​చేసిన మిర్జా ఆదీబ్​అహ్మద్ ప్లేయర్ ఆఫ్​ ది మ్యాచ్​గా ఎంపికయ్యారు. మందమర్రి టైగర్స్, భీమారం జట్ల మధ్య జరిగిన మరో మ్యాచ్ లో భీమారం జట్టు నిర్దేశిత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 108 రన్స్​చేసింది. కల్యాణ్​పటేల్​ 22, వీరేందర్​24 రన్స్​ చేశారు. తర్వాత బ్యాటింగ్​కు దిగిన మందమర్రి టైగర్స్ జట్టు 18.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి టార్గెట్​ను ఛేజ్​చేసింది. 37 రన్స్​తో పాటు 5 వికెట్లు తీసిన వేణు ప్లేయర్​ఆఫ్​ ది మ్యాచ్​గా ఎంపికయ్యారు. పోటీల నిర్వాహకుడిగా సీనియర్​క్రికెటర్ నీలం రాకేశ్​గౌడ్, అంపైర్లుగా​కిశోర్ సంతోశ్​వ్యవహరించారు.