హైదరాబాద్ లో అండమాన్ జైలు

హైదరాబాద్ లో అండమాన్ జైలు

కాలాపాని జైలు అనగానే చాలామందికి అండమాన్‌ లోని సెల్యులార్‌ జైలుగుర్తు కు వస్తుంది. కానీ ఆ జైలుకన్నా సుమారు యాభై ఏళ్ల ముందేతెలంగాణలో అలాంటి జైలు ఉంది. అండమాన్‌ జైల్లో స్వాతంత్య్రసమరయోధులను బందీలుగా ఉంచితే.. అంతకంటే ఎక్కువ చరిత్రఉన్న ఇక్కడి కాలాపాని జైల్లో తప్పు చేసిన బ్రిటీష్‌ సైనికులను ఉంచేవాళ్లు.అండమాన్‌ లో కాలాపాని జైలు కట్టడానికి నమూనా కూడా ఈ జైలే.

తెలంగాణలో ఉన్న కాలాపాని జైలు గురించి చాలా కొద్దిమందికి మాత్రమేతెలుసు. ఇప్పటితరం వాళ్లకైతే పూర్తిగా తెలియకపోవచ్చు. ఎప్పుడు కట్టారు? ఎక్కడఉంది? దాని చరిత్ర ఏంటి? ప్రత్యేకతేంటి?…తెలుసుకుంటే.. ఆశ్చర్యపోతారు.

ఎక్కడ.. ఎలా కట్టారు?

సికిం ద్రాబాద్‌ దగ్గర్లో ఉన్న తిరుమలగిరిచౌరస్తాకు అతి సమీపంలో ఉంది ఈ కారాగారం. 1858లో అప్పటి బ్రిటీష్‌అధికారులు ఈ జైలును కట్టిం చారు. ఆరోజుల్లోనే దీని నిర్మాణానికి 4.71 లక్షలరూపాయలు ఖర్చు అయింది . ఈ జైలు విస్తీర్ణంసుమారు ఇరవై వేల మూడువందల నలభైనాలుగు చదరపు అడుగులు (20,344). ఇదిమూడు అంతస్తుల భవనం. పై నుం చి చూస్తేశిలువ ఆకారంలో కనిపిస్తుంది . రెండు, మూడుఅంతస్తుల్లో కలిపి 75 గదులు ఉన్నాయి . కిందిఅంతస్తులో నలభై గదులున్నాయి. ఈ గదులుఇప్పటికీ పటిష్టం గా కనిపిస్తాయి . ఖైదీలు తప్పించుకునే అవకాశం లేకుండా తలుపులను ఇనుముతో గట్టిగా తయారు చేశారు. ఖైదీలను ఇనుపతాళ్లతో కట్టివేసే వాళ్లు ఇక్కడ.

కిటికీలు

ఈ జైల్లో ఉన్న కిటీకీల గురించి వివరంగాచెప్పాలి. ఖైదీలను ఉంచే ప్రతి గదికి ఒకచిన్న కిటికీ ఉంటుంది . అయితే అవిఅందరికీ తెలిసిన కిటికీల లాంటివి కాదు.చాలా ప్రత్యేకంగా కట్టినవి. ఎలా అంటే…గదిలో పలున్న ఖైదీలు కిటికీ నుంచి బయటకుచూస్తే వాళ్లకు కేవలం కిటికీకి ఎదురుగాఉన్న కొద్ది ప్రదేశం మాత్రమే కనిపిస్తుంది .బయట ఏం జరుగుతుందో తెలియదు. కానీ,బయటి నుంచి కిటికీ గుండా లోపలికి చూస్తేమాత్రం.. గదిలోని ప్రతిభాగం పూర్తిగాకనిపిస్తుంది . ఖైదీలు లోపల ఏం చేస్తున్నారు?ఎలా ఉన్నారు?.. అన్నీ చూడొచ్చట. ఇప్పటికీ ఈకిటికీల నిర్మాణం అంతుచిక్కని రహస్యమే.

ఉరిశిక్ష

జైలు మూడో అంతస్తు పైభాగంలో ఉరిశిక్షనుఅమలు చేసేం దుకు సంబంధిం చిన ఇనుపకమ్మీలు ఉన్నాయి . ఉరిశిక్ష అమలుకుముందు అధికారులు ఖైదీలకు, వాళ్లఇష్టదైవాన్ని ప్రార్థించుకునే అవకాశం కూడాకల్పించేవారట. అందుకోసం ఒక గదినేఏర్పాటు చేశారు. ఆ గదిలో వివిధ మతాలకుచెంది న దేవుళ్లు, దేవతల పటాలు ఉండేవి.ఉరిశిక్ష అమలు చేసేటప్పుడు ఏదైనా లోపంవల్ల ఖైదీ చనిపోకపోతే, ఉరికంబం కింద ఉన్నబావిలో పడి తప్పకుండా చనిపోయేవాడట.ఎందుకంటే, సరిగ్గా ఉరి స్తంభం కింది వంద అడుగుల లోతున్న బావి ఉంది. ఈ బావి అడుగున బాణాల్లాంటి ఇనుప చువ్వలు ఉన్నాయి . అందువల్ల ఉరిశిక్ష వేసిన ఖైదీ బతికేఅవకాశం ఉండేది కాదు. ఈ కాలాపాని జైల్లో ఐదువందలమందికి ఉరి వేసినట్లు అధికారులుచెప్తారు.

ప్రత్యేకత

ఈ జైలు పైనుంచి చూస్తే సికింద్రాబాద్‌ అంతాకనిపిస్తుంది . ప్రస్తుతం ఈ జైలు మిలిటరీవాళ్ల ఆధీనంలో ఉంది. ఇతరులను లోపలకు అనుమతించడం లేదు. కేంద్ర ప్రభుత్వం దీనినినేషనల్‌ మ్యూజియంగా ప్రకటించింది . ఈజైలుకు హెరిటేజ్‌ అవార్డు కూడా లభించింది .రెండో ప్రపంచ యుద్ధకాలంలో వందలాది మంది సైనికులను ఇక్కడే ఉంచారు.అలాగే ఆపరేషన్‌ బ్లూస్టార్‌ లో భాగంగా(1984లో.. స్వర్ణదేవాలయం సంఘటనకుసంబంధిం చినది) ఆ ఖైదీలను ఇక్కడే ఉంచారు.1994 నుం చి ఈ జైలు వినియోగంలో లేదు.తిరుమల గిరిలోని మిలిటరీ అధికారుల అనుమతితో ఈ జైలును చూడొచ్చు.ఇప్పటికీ ఇది చెక్కు చెదరకుండా ఉంది. అందుకేఅండమాన్‌ జైలును చూడాలనుకునే వాళ్లుఅక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు.మన భాగ్యనగరంలోని ఈ జైలును చూడొచ్చు .