ఎవరెస్ట్ శిఖరాన్ని మరోసారి అధిరోహించిన కమీ రీటా షెర్పా

ఎవరెస్ట్ శిఖరాన్ని మరోసారి అధిరోహించిన కమీ రీటా షెర్పా

కాఠ్మండు : నేపాల్ పర్వతారోహకుడు కమీ రీటా షెర్పా(53) ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని మరోసారి అధిరోహించారు. ఈ నెల17న 27వ సారి ఎవరెస్ట్‌‌‌‌ను ఎక్కిన ఆయన.. ఎక్కువ సార్లు ఎవరెస్ట్‌‌‌‌ను అధిరోహించిన వ్యక్తిగా రికార్డు నెలకొల్పారు. అది జరిగిన వారంలోపే 28వ సారి కూడా ఎవరెస్ట్‌‌‌‌ను అధిరోహించి తన రికార్డును తానే తిరగరాశారు.

మంగళవారం ఉదయం 9:20 గంటలకు 8848.86 మీటర్ల ఎత్తున ఎవరెస్ట్‌‌‌‌పైకి కమీ రీటా చేరుకున్నట్లు ఈ పర్వతారోహణ యాత్రను నిర్వహించిన 'సెవెన్ సమ్మిట్ ట్రెక్' మేనేజర్ చాంగ్ దావా షెర్పా తెలిపారు. కమీ రీటా మొదటిసారిగా 1994, మే 13న ఎవరెస్ట్‌‌‌‌ను అధిరోహించారు. ఇప్పటివరకూ 8,000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తున్న ఎన్నో  ప్రసిద్ధ శిఖరాలను అధిగమించారు. ప్రస్తుతం ఆయన సెవెన్ సమ్మిట్ ట్రెక్స్‌‌‌‌లో సీనియర్ క్లైంబింగ్ గైడ్‌‌‌‌గా పనిచేస్తున్నారు.