మాధవన్, కంగనా రనౌత్ కాంబినేషన్ అనగానే.. ‘తను వెడ్స్ మను’ సిరీస్లో వచ్చిన రెండు సినిమాలు గుర్తొస్తాయి. ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ వీళ్లిద్దరి కాంబినేషన్లో మరో సినిమా వస్తోంది. కంగనతో ‘తలైవి’ తీసిన ఎ.ఎల్.విజయ్ ఈ తమిళ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ట్రైడెంట్ ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తోంది.
ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్. శనివారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను ప్రారంభించినట్టు కంగనా రనౌత్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. అంతేకాదు ఫస్ట్ డే షూటింగ్ చేస్తుండగా.. రజినీకాంత్ తమ సెట్స్కు వచ్చి సర్ప్రైజ్ చేశారని ఆనందం వ్యక్తం చేసింది కంగన.