మరో బయోపిక్‌‌‌‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కంగనా

 మరో బయోపిక్‌‌‌‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కంగనా

మొదట్లో ఫుల్ గ్లామరస్ పాత్రలు చేసింది కంగనా రనౌత్. దాంతో ఆమె కమర్షియల్ హీరోయిన్‌‌‌‌గానే మిగిలిపోతుంది అనుకున్నారంతా. కానీ ఎవరూ ఊహించని స్థాయికి చేరుకుంది. నటిగా ఎన్నో మెట్లు చకచకా ఎక్కేసింది. నాలుగుసార్లు జాతీయ అవార్డును అందుకుంది. మెగాఫోన్ పట్టి డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గాను, మరోవైపు నిర్మాతగాను కూడా ప్రూవ్ చేసుకుంది. ఇప్పుడామె బాలీవుడ్‌‌‌‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. అయితే కమర్షియల్ మూవీస్‌‌‌‌ కంటే రియాలిటీకి దగ్గరగా ఉండే సబ్జెక్టులకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తోంది. రియల్ లైఫ్ క్యారెక్టర్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తోంది. ఇప్పటికే ‘మణికర్ణిక’లో ఝాన్సీ లక్ష్మీబాయిగా అలరించింది. ‘తలైవి’లో జయలలితగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ‘ఎమర్జెన్సీ’లో ఇందిరాగాంధీ పాత్ర పోషిస్తోంది. ఇప్పుడు మరో బయోపిక్‌‌‌‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

బెంగాలీ నటి వినోదినీ దాసి పాత్రలో కనిపించనుంది కంగనా. పరిణీత, మర్దానీ వంటి ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రాలు తీసిన ప్రదీప్ సర్కార్‌‌‌‌‌‌‌‌ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఆయన దర్శకత్వంలో నటించడాన్ని ఓ గౌరవంగా భావిస్తున్నానని కంగనా సంతోషంగా చెబుతోంది. పంతొమ్మిదో శతాబ్దంలో బెంగాలీ చిత్ర పరిశ్రమలో స్టార్‌‌‌‌‌‌‌‌ హీరోయిన్‌‌‌‌గా వెలిగారు వినోదిని. ‘అమర్‌‌‌‌‌‌‌‌కథ’ పేరుతో ఆటోబయోగ్రఫీ కూడా రాసి సెన్సేషన్ క్రియేట్ చేశారు. అలాంటి లెజెండరీ యాక్ట్రెస్ పాత్రకి కంగనా తప్పక న్యాయం చేస్తుందంటున్నారంతా.