తోబుట్టువులకు కంగన ఖరీదైన గిఫ్ట్

తోబుట్టువులకు కంగన ఖరీదైన గిఫ్ట్

ముంబై: బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. హాట్ కామెంట్లతో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకుంది. అలాంటి కంగన తాజాగా తన తోబుట్టువులకు కోట్ల రూపాయల ఖరీదు చేసే ప్లాట్లు గిఫ్ట్‌‌గా ఇచ్చి మరోమారి వార్తల్లో నిలిచింది. పంజాబ్‌లోని చండీగఢ్‌‌లో రూ.4 కోట్ల ఖరీదు చేసే నాలుగు లగ్జరీ ప్లాట్లను సోదరుడు అక్షత్, సోదరి రంగీలా చండేల్‌‌కు బహుమతిగా ఇచ్చింది. స్వయంగా ఈ విషయాన్ని కంగనానే కన్ఫర్మ్ చేసింది. తన కుటుంబం కోసం లగ్జరీ అపార్ట్‌‌మెంట్‌‌లను నిర్మిస్తున్నానని, 2023కల్లా అవి సిద్ధమవుతాయని ఆమె ట్వీట్ చేసింది. తన కుటుంబం కోసం ఈ మాత్రం చేసే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొంది.