ముంబై: రిపబ్లిక్ టీవీ న్యూస్ యాంకర్ అర్నాబ్ గోస్వామిని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేయడంపై బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఘాటుగా స్పందించింది. ప్రశ్నించే గొంతుకలను అణచి వేస్తున్నారంటూ శివ సేన ప్రభుత్వంపై కంగన మండిపడింది. మెసేజ్ ఫర్ మహారాష్ట్ర గవర్నమెంట్ అంటూ ఓ వీడియోను ట్వీట్ చేసింది.
Message for Maharashtra government @republic #Arnab #ArnabWeAreWithYou #ArnabGoswami pic.twitter.com/AJizRCitS7
— Kangana Ranaut (@KanganaTeam) November 4, 2020
‘మహారాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఒక్కటే అడగదల్చుకున్నా.. మీరు అర్నాబ్ గోస్వామి ఇంట్లోకి వెళ్లారు. ఆయనపై దాడికి దిగారు. ఆయనను కొట్టి, జుట్టు పట్టుకొని లాక్కెళ్లారు. ఎన్ని ఇళ్లను మీరు ధ్వంసం చేస్తారు? సోనియా సేన ఎన్ని నోళ్లను మూయిస్తుంది? ప్రశ్నించే గొంతుకలు పెరుగుతూనే ఉంటాయి. మా కంటే ముందు స్వేచ్ఛ కోసం ప్రశ్నించే ఎందరో అమరుల గొంతులను కోసేశారు. మీరు ఒకరి వాయిస్ను అణచాలని చూస్తే ప్రశ్నించడానికి ఇంకొకరు పుట్టుకొస్తారు. ఎన్ని గొంతుకలను మీరు అణచివేస్తారు? మీకెందుకు కోపం వస్తోంది. పప్పూ సేన, సోనియా సేన అని పిలిస్తే కోపం వస్తోందా? పప్పూ లాంటి పనులు చేస్తే పప్పూ సేన అనే పిలుస్తారు. అవును, మీది సోనియా సేనే కదా’ అని వీడియోలో కంగన పేర్కొంది.