మహిళపై అత్యాచారం.. కంగనా బాడీగార్డ్ మీద కేసు

మహిళపై అత్యాచారం.. కంగనా బాడీగార్డ్ మీద కేసు

న్యూఢిల్లీ: ఒక మహిళను రేప్ చేసిన కేసులో కుమార్ హెగ్డే అనే వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ వద్ద కొన్నేళ్లుగా కుమార్ పర్సనల్ బాడీగార్డ్ గా విధులు నిర్వహిస్తున్నాడని సమాచారం. అయితే కుమార్ నిజంగా కంగనా బాడీ గార్డా కాదా అనే విషయంపై పోలీసులు స్పందించలేదు. కానీ ఓ మహిళతోతో లివిన్ రిలేషన్ షిప్ లో ఉంటున్న కుమార్.. సడన్ గా బ్రేకప్ చేసుకున్నాడని డీఎన్ నగర్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్స్ పెక్టర్ భరత్ గైక్వాడ్ అన్నారు. అతడిపై అసహజ లైంగిక ఆరోపణల మీద ఐపీసీ సెక్షన్ 376, 377 కింద కేసులు నమోదు చేశామని తెలిపారు. 

పెళ్లి చేసుకుంటానని చెప్పి కుమార్ హెగ్డే తనను మోసం చేశాడని బాధితురాలు వాపోయింది. ఎనిమిదేళ్ల నుంచి తమకు పరిచయం ఉందని, గత జూన్ లో కుమార్ తనను పెళ్లి చేసుకుంటామని ప్రపోజ్ చేశాడని ఆమె చెప్పింది. పెళ్లికి తాను ఒప్పుకోవడంతో పలుమార్లు తనను బలవంతంగా అత్యాచారం చేశాడని ఆరోపించింది. అలాగే గత ఏప్రిల్ లో తన ఫ్లాట్ లో నుంచి రూ.50 వేలు ఎత్తుకెళ్లాడని పేర్కొంది. ఆ తర్వాత నుంచి కుమార్‌ తనతో మాట్లాడటం మానేశాడని చెప్పింది. జూన్ 5వ తేదీన మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు కుమార్‌ హెగ్డే సిద్దపడ్డాడని తెలిసిందని.. దీంతో ముంబై పోలీసులను ఆశ్రయించానని వివరించింది.