‘పంజుర్లి’ హెచ్చరికలు నిజమవుతున్నాయా? కాంతార ప్రీక్వెల్‌లో వ‌రుస విషాదాలు.. షూటింగ్లో మరో నటుడు మృతి

 ‘పంజుర్లి’ హెచ్చరికలు నిజమవుతున్నాయా? కాంతార ప్రీక్వెల్‌లో వ‌రుస విషాదాలు.. షూటింగ్లో మరో నటుడు మృతి

రిషబ్ శెట్టి నటిస్తున్న కాంతారా ప్రీక్వెల్లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని తీర్థహళ్లి తాలూకాలోని అగుంబేలో జరుగుతోంది. ఈ క్రమంలో కాంతారా 2లో నటిస్తున్న ప్రముఖ సినీ, మిమిక్రీ నటుడు కళాభవన్ నిజూ గుండెపోటుతో మరణించారు.

కేరళలోని త్రిసూర్‌కు చెందిన నిజూ వికె ‘కాంతార’ సినిమా షూటింగ్ కోసం కర్ణాటకకు వచ్చారు. బుధవారం (జూన్ 11) రాత్రి ఆయన అగుంబే సమీపంలోని హోమ్‌స్టేలో ఉంటున్నప్పుడు తీవ్రమైన ఛాతీ నొప్పితో బాధపడుతున్నట్లు ఫిర్యాదు చేశారు.

ఆ వెంటనే నిజూను తీర్థహళ్లిలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ మార్గమధ్యంలోనే అతను ప్రాణాలు కోల్పోయాడు. ఇపుడీ ఈ కొత్త ప్రమాదంతో కాంతారా 2 బృందం అయోమయంలో పడింది. అసలేం జరుగుతోంది? మే నెల నుంచి ఈ వరుస మరణాలేంటీ? ఇలా ఎందుకు జరుగుంతుందని? నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. 

‘పంజుర్లి’  హెచ్చరికలు నిజమవుతున్నాయా?

ఈ క్రమంలో కాంతార సినిమాలో పంజుర్లి దేవత హెచ్చరికల గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కొందరు నెటిజన్లు ఆ హెచ్చరికలు నిజమవుతున్నాయని, సినిమా నటులు వరుసగా మరణిస్తున్నారని అంటున్నారు. అయితే, ఇవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమేనని, వాటికి శాస్త్రీయ ఆధారాలు లేవని మరికొందరు వాదిస్తున్నారు.

కళాభవన్ నిజూ సినీ కెరీర్ విషయానికి వస్తే.. 

కళాభవన్ నిజూ కేరళలోని త్రిస్సూర్ జిల్లాలోని వదనప్పల్లిలో జన్మించారు. ఆయన 25 సంవత్సరాలకు పైగా విజయవంతమైన మిమిక్రీ కెరీర్‌ను కలిగి ఉన్నారు. 1990ల చివర్లో కేరళలోని మిమిక్రీ సోదరులు నిర్వహించిన హై-ఎనర్జీ రోడ్‌షోలతో ఆయన తన కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ ఆయన తన అద్భుతమైన కామిక్ టైమింగ్ మరియు ఎలక్ట్రిక్ స్టేజ్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను వీపరీతంగా ఆకట్టుకున్నారు. అంతేకాకుండా, మలికప్పురం మరియు మార్కో వంటి సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేశారు.

కాంతారా 2 వరుస విషాదాలు:

కాంతారా 2 షూటింగ్ మొదలైనప్పటి నుంచి పలు వరుస ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. షూటింగ్ స్టార్ట్ చేసిన వెంటనే కొల్లూరులోనే జూనియర్ ఆర్టిస్టులతో వెళ్తున్న బస్సు సడెన్ గా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోయినప్పటికీ.. అందులో కొందరికీ తీవ్ర గాయాలయ్యాయి.

అంతేకాకుండా ఓ సారి గాలి వాన రావడం వల్ల నిర్మించిన భారీ సెట్ కూలిపోయింది. అప్పుడు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.ఈ 2025 మే మొదలు నుండి కాంతారా 2లో నటిస్తున్న వారు వరుసగా.. వారాల వ్యవధిలోనే చనిపోతున్నారు.  

ఇటీవలే కన్నడ నటుడు-హాస్యనటుడు రాకేష్ పూజారి 33 సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించారు. దానికంటే ముందు మళయాళీ జూనియర్ ఆర్టిస్ట్ కపిల్ (33) ప్రమాదవశాత్తు నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన ఉడిపి జిల్లా బైందూర్లోని కొల్లూరులో జరిగింది.