న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ బైపోల్ నేపథ్యంలో చోటుచేసుకున్న పరిణామాలను రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ తీవ్రంగా ఖండించారు. బీజేపీతో ఎన్నికల సంఘం(ఈసీ) కుమ్మక్కైందని ఆరోపించారు. ఇది ‘ప్రజాస్వామ్య హత్య’, ‘జవాబుదారీతనంలేని సంపూర్ణ నిరంకుశత్వం’ అని ఆయన అభివర్ణించారు. నందిగ్రామ్ కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్ అరెస్టు ‘పగటిపూట ప్రజాస్వామ్య హత్య’ అని పేర్కొన్నారు.
‘ఈసీ, ప్రభుత్వాల మధ్య ఈ జుగల్బందీ, ప్రజాస్వామ్యాలపై దాడులు, స్పీకర్ ఏకపక్ష నిర్ణయాలు ఎంతకాలం కొనసాగుతాయి? దేశమంతా ఈ నాటకాన్ని చూస్తోంది. వెస్ట్ బెంగాల్లో ఈ నెల 13న టీఎంసీ తరఫున నందిగ్రామ్ లో సంచిత ప్రధాన్, రెజినగర్లో రబియుల్ ఆలం చౌదరి నామినేషన్లు దాఖలు చేశారు. ఈలోగా టీఎంసీ గుర్తును ఈసీ నిలిపివేసింది’ అని సిబల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
