దేశంలో రోజు రోజుకీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో ప్రజల్లో భయపడిపోతున్నారు. ప్రయాణాల్లో ఎవరు దగ్గినా, తుమ్మునా వారి వైపు అదోలా చేస్తున్నారు. ఈ భయంతో చాలా మంది బయటకు వెళ్తే మాస్కులు ధరిస్తున్నారు. అయితే మెడికల్ షాపుల్లోనూ వీటి కొరత, అధిక ధరలకు అమ్ముతున్నారు. ఈ పరిస్థితుల్లో కర్ణాటకలో ఓ బస్సు డ్రైవర్, కండక్టర్ తమ మంచి మనసును చాటుకున్నారు. బస్సులో ప్రయాణికులకు ఉచితంగా మాస్కులు పంచారు. వారు చేసిన మంచిపనికి ప్రయాణికులంతా మెచ్చుకున్నారు.
Karnataka:Conductor ML Nadaf&driver HT Mayannavar bought&distributed masks among passengers travelling in their bus from Yaraguppi to Hubli. ML Nadaf says,"We took this initiative as ppl are avoiding travel because of coronavirus.I request govt to distribute free masks to people" pic.twitter.com/DjqO59GMg4
— ANI (@ANI) March 14, 2020
యరగుప్పి-హుబ్లీ మధ్య ప్రయాణించే కర్ణాటక ఆర్టీసీ బస్సు డ్రైవర్ హెచ్టీ మయాన్నవర్, కండక్టర్ ఎంఎల్ నడాఫ్ సొంత డబ్బుతో మాస్కులు కొని బస్సులో అందరికీ పంచారు. ఎక్కడ కరోనా వైరస్ బారినపడుతామోనని ప్రజలు భయపడుతున్నారని, ప్రయాణాలు కూడా చేయడం లేదని ఆ ఇద్దరు చెబుతున్నారు. వారిలో ఆ భయాన్ని పోగొట్టేందుకు ఇలా ఉచితంగా మాస్కులు పంచామని తెలిపారు. ప్రభుత్వమే అందరికీ ఫ్రీగా మాస్కులు అందజేయాలని వారు కోరుతున్నారు.