కరోనా ఎఫెక్ట్: కర్నాటక సీఎం ఆఫీస్ మూసివేత

కరోనా ఎఫెక్ట్: కర్నాటక సీఎం ఆఫీస్ మూసివేత

బెంగళూరు: సిబ్బంది కుటుంబ సభ్యుడికి కరోనా సోకడంతో కర్నాటక సీఎం యడ్యూరప్ప ఆఫీస్ కమ్ రెసిడెన్స్ భవనాన్ని అధికారులు మూసివేశారు. శుక్రవారం శానిటైజేషన్ ప్రారంభించామని రెండ్రోజుల్లోనే తిరిగి ఓపెన్‌ చేస్తామని ప్రకటించారు. సీఎం ఆఫీసులో పనిచేస్తున్న ఒక మహిళా సిబ్బంది.. తన భర్తకు కరోనా రావడంతో రెండ్రోజుల కిందటి నుంచే హోం క్వారంటైన్ లో ఉన్నారని, ముందు జాగ్రత్త చర్యగా ఆఫీస్ మొత్తాన్ని క్లీన్ చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ మేరకు సీఎం యడ్యూరప్ప అధికారిక కార్యకలాపాలను విధాన్ సౌధ నుంచి నిర్వహిస్తున్నారని తెలిపారు.