మళ్లీ ఆస్పత్రిలో చేరిన కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్

మళ్లీ ఆస్పత్రిలో చేరిన కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్

కర్ణాటక పీసీసీ అధినేత డీకే శివకుమార్ మళ్లీ ఆస్పత్రిలో చేరారు. గత నెలలో కరోనా బారిన పడిన డీకే… బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుని కోలుకున్నారు. ఇటీవలే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కూడా అయ్యారు.  అయితే ఆయనకు మళ్లీ జ్వరం రావడంతో ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని ఆయన కార్యాలయ వర్గాలు ప్రకటించాయి. కర్ణాటకలో కరోనా కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఆ రాష్ట్రానికి చెందిన పలువురు రాజకీయ నాయకులు కరోనా వైరస్ బారిన పడ్డారు.