బెంగళూరు వేదికగా జరుగుతోన్న ఏజిస్ సౌత్ జోన్ టోర్నమెంట్లో విషాద ఘటన చోటుచేసుకుంది. కర్ణాటక క్రికెటర్ కె. హొయసల (34) గుండెపోటుతో మరణించాడు. గురువారం బెంగళూరులోని ఆర్ఎస్ఐ మైదానంలో తమిళనాడుతో జరిగిన మ్యాచ్లో హోయసల ఆడాడు. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో విజయం సాధించిన అనంతరం అతను జట్టుతో కలిసి డిన్నర్కు వెళ్లే ముందు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
హోయసల మైదానంలోనే కుప్పకూలడంతో వెంటనే వైద్య సిబ్బంది అతనికి అత్యవసర చికిత్స అందించే ప్రయత్నించారు. అయితే చికిత్సకు అతను స్పందించకపోవడంతో వెంటనే అంబులెన్స్లో బెంగళూరులోని బౌరింగ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచాడు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్, బౌలర్ అయిన హొయసల అండర్-25 విభాగంలో కర్ణాటక జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. కర్ణాటక ప్రీమియర్ లీగ్లోనూ ఆడాడు.