
కర్ణాటకలో రికార్డు భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 125 యేళ్లలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా ఏప్రిల్ ,మే నెలల్లో భారీ వర్షపాతం నమోదు కావడం ఇదే తొలిసారి. సాధారణ వర్షపాతం కంటే ఇది 197శాతం ఎక్కువ. భారీవర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా భారీ విధ్వంసం వాటిల్లింది.
71 మంది మృతి, వందలాది ఇళ్లు ధ్వంసం
గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కర్ణాటక వ్యాప్తంగా విధ్వంసం సృష్టించాయి.ఫలితంగా 71 మంది మృతిచెందారు. పిడుగుపాటు కు 48 మంది, చెట్లు కూలిమీదపడి 9మంది, ఇళ్లు కూలిపోవడంతో ఐదుగురు, వరదల్లో గల్లంతయ్యి నలుగురు, కొండచరియలు విరిగిపడటంతో మరో నలుగురు, కరెంట్ షాక్ తో ఒకరు మృతిచెందినట్లు కర్ణాటక ప్రభుత్వం వివరాలు వెల్లడించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు సీఎం సిద్దరామయ్య.
#Agumbe started the MONSOON 2025 with 25.5 mm
— Naveen Reddy (@navin_ankampali) June 1, 2025
June - September, official monsoon time.#KarnatakaRains pic.twitter.com/kTD73CJf5d
Localised flood in Mangaluru after the Forenoon Deluge.
— Namma Karnataka Weather (@namma_vjy) May 25, 2025
Credits to Yogesh Bhat #KarnatakaRains #TulunaduRains pic.twitter.com/8eUBmU2EhK
నైరుతి రుతుపవనాల ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాణనష్టంతో పాటు భారీగా ఆస్తినష్టం సంభవించింది. వర్షాలకు దాదాపు 700కు పైగా పశువులు మృతిచెందినట్లు అధికారులు ప్రకటించారు. వీటిలో 698 కేసులకు పరిహారం పంపిణీ చేసినట్టు తెలిపారు.
#KarnatakaRains #Mangalore pic.twitter.com/XPR6gBgZXz
— Webdunia Kannada (@WebduniaKannada) May 26, 2025
భారీవర్షాలతో కర్ణాటకలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో భారీ ఎత్తున నష్టాన్ని చూశాయి. రాష్ట్రవ్యాప్తంగా 2వేల68 ఇళ్లు ధ్వంసమయ్యాయి. వీటిలో 75 ఇళ్లు పూర్తిగా నేలమట్టం అయ్యాయని అధికారులు తెలిపారు. నష్టం వాటిల్లిన 1926 కుటుంబాలకు ఆర్థిక సాయం అందించామని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది.
50వేల ఎకరాల్లో పంటలు నాశనం..
భారీ వర్షాలతో కర్ణాటకలో వ్యవసాయం తీవ్రంగా దెబ్బతిన్నది. 15వేల378 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. ఇందులో 11వేల915హెక్టార్లలో వ్యవసాయ పంటలు ,3వేల462 హెక్టార్లలో ఉద్యానవన పంటలు ఉన్నాయి. రైతులకు త్వరితగతిన ఆర్థిక సహాయం అందేలా అధికారులు చర్యలు చేపట్టారు. నష్టపరిహార పోర్టల్లో నష్ట వివరాలను అప్లోడ్ చేయడం ద్వారా ఆర్థికసాయం చేసేందుకు సిద్దమవుతున్నారు.
రిలీఫ్ఫండ్..
వర్షాలు, వరదల బాధితులకు సాయం అందించేందుకు కర్ణాటక ప్రభుత్వం ఫండ్స్ సిద్దంగా ఉన్నట్లు ప్రకటించింది. రాష్ట్ర విపత్తు ప్రతిస్పదన నిధి(SDRF) కింద వెయ్యికోట్ల నిధులున్నట్లు తెలిపింది. అత్యవసర సాయం కోసం ఈ నిధులను వాడుకోవాలని జిల్లాల అధికారులను సీఎం సిద్దరామయ్య ఆదేశించారు. పూర్తి వర్షాకాలం రాబోతుంది.. అన్ని జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించాలని అధికారులను ఆదేశించారు.