బెంగళూరులో భారీ వర్షం.. ఆరెంజ్ అలర్ట్

బెంగళూరులో భారీ వర్షం.. ఆరెంజ్ అలర్ట్

కర్ణాటక వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడ్డాయి.బెంగళూరులో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. మంగళవారం అర్థరాత్రి ఉరుములు, మెరుపులతో కుండపోత వాన పడటంతో నగరంలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరదనీరు వచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని ఏరియాల్లో మోకాళ్ల లోతు వరకు వరద నీరు నిలిచిపోయింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో మంత్రిమాల్ స్టేషన్ వద్ద గ్రీన్ లైన్ లో మెట్రో ను నిలపివేశారు. భారీ వర్షం కారణంగా పీణ్యలోని ట్రాన్స్ ఫార్మర్లు, పుత్రహళ్లిలోని KPTCL ట్రాన్స్ ఫార్మర్లు ట్రిప్ అయ్యాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కొన్ని ప్రాంతాలకు కరెంట్ కట్ అయ్యింది. వర్షానికి దెబ్బతిన్న ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన అధికారులు పునరుద్ధరణ పనులు చేపట్టారు. వరద నీరు రోడ్లపై నిలిచిపోవడంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది. గురువారం కూడా బెంగళూరులో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

మైసూరు శివార్లలోని బోగాది ప్రాంతంలో రహదారి వంతెన తెగిపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఇబ్బందులు ఎదురయ్యాయి.కుక్కరహళ్లి వద్ద చెట్టు కూలడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాజ్ కుమార్ రోడ్డు, బన్నూరు రోడ్డులో ఇళ్లల్లోకి నీరు చేరింది. అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని జాలర్లను అధికారులు హెచ్చరించారు. . నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవుల్లోకి ప్రవేశించడం వల్లనే రాబోయే మూడ్రోజుల పాట దక్షిణ కన్నడ, ఉడిపి, ఉత్తర కన్నడ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.


వర్ష ప్రాభావిత ప్రాంతాలైన దక్షిణ బెంగళూరు,చికమగళూరు,హొసకెరెహళ్లిలో కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై, మంత్రులు అశోక్,మునిరత్న, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి, అధికారులు సందర్శించారు. భారీ వర్షానికి దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించి సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు.

మరిన్ని వార్తల కోసం 

కరీంనగర్​లో నీళ్ల గోస నిజమే

ఇవాళ పల్లె,పట్టణ ప్రగతిపై కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష