ఎస్వీబీసీకి రూ.1.20 కోట్ల విలువైన వాహనాన్ని విరాళ‌మిచ్చిన‌ మంత్రి

ఎస్వీబీసీకి రూ.1.20 కోట్ల విలువైన వాహనాన్ని విరాళ‌మిచ్చిన‌ మంత్రి

ఎస్వీబీసీకి రూ.1.20 కోట్ల విలువైన డి.ఎస్.ఎన్.జి వాహనం విరాళంగా అందించారు కర్ణాటక సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బి.శ్రీరాములు. శుక్రవారం శ్రీవారి ఆలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో ఈ వాహనానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి తరఫున ప్రతినిధి శ్రీ మంజునాథ్ వాహనం తాళాలను టిటిడి అద‌న‌పు ఈవో మరియు ఎస్వీబీసీ ఎండి శ్రీ ఎ.వి.ధ‌ర్మారెడ్డికి అందజేశారు.

ఈ సందర్భంగా శ్రీ ఎ.వి.ధ‌ర్మారెడ్డి మాట్లాడుతూ శ్రీవారి ఆలయం, శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాల్లో జరిగే సేవలు, ఇతర ధార్మిక కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఆధునిక టెక్నాలజీతో కూడిన ఈ వాహనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా దాతకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్వీబీసీ సిఈఓ శ్రీ సురేష్ కుమార్, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.