కర్ణాటక ప్రభుత్వంలో పనిచేస్తున్న ఓ మహిళా అధికారిణి బెంగళూరులోని తన ఇంట్లో శనివారం రాత్రి హత్యకు గురైంది. కర్నాటకలోని మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్లో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్న ప్రతిమ.. సుబ్రమణ్యపోరాలోని తన నివాసంలో గుర్తుతెలియని దుండగులు ఆమెను కత్తితో పొడిచి హత్యకు పాల్పడ్డారు. ఆదివారం తెల్లవారుజామున ప్రతిమ సోదరుడు ఆమె ఇంటికి వచ్చి చూడగా ఆమె శవమై కనిపించింది.
వెంటనే అతను పోలీసులను సంప్రదించాడు. ఎప్పటిలాగే శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ప్రతిమ ఇంటికి తిరిగి వచ్చిందని, ఆ రోజు రాత్రి,ఈ రోజు ఉదయం ఫోన్ కాల్లకు స్పందించకపోవడంతో ఆమె అన్నయ్య ఆమె ఇంటికి వచ్చి చూడగా ఆమె శవమై కనిపించిందని పోలీసులు వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నారు.
ALSO READ : గురుగ్రామ్లో దారుణం.. భార్య చేతిలో ఏఎస్ఐ హత్య