తల్లిని హత్య చేసి, మృతదేహాన్ని ట్రాలీ బ్యాగ్లో కూక్కేసిన సేనాలి సేన్ అనే మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు. అత్యంత షాకింగ్ కు గురి చేసే ఈ ఘటన బెంగళూరులోని ఓ అపార్ట్మెంట్లో చోటుచేసుకుంది.
బెంగళూరులో ఓ షాకింగ్ హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 39 ఏళ్ల మహిళ తన తల్లిని హత్య చేసి, ఆపై సూట్కేస్లో ఆ వృద్ధురాలి మృతదేహంతో పోలీస్ స్టేషన్కు చేరుకుంది. MICO లేఅవుట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిలేకహళ్లి ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తన్న సేనాలి సేన్ అనే మహిళ ఆవేశంతో, కోపంలో తన 70 ఏళ్ల తల్లి బీవా పాల్ను హత్య చేసింది.
సెనాలీ సేన్ తన నేరాన్ని అంగీకరించింది
హత్యానంతరం, నిందితురాలు తన తల్లి మృతదేహాన్ని సూట్కేస్లో పెట్టి పోలీస్ స్టేషన్కు చేరుకుంది. అక్కడ ఆమె నేరాన్ని అంగీకరించింది. "శవాన్ని సెనాలీ సేన్ జూన్ 12న పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. ఆమెపై (39)పై IPC సెక్షన్ 302, ఇతర సెక్షన్ల కింద కేసు బుక్ చేశామ"ని MICO లేఅవుట్ పోలీసులు తెలిపారు.
తల్లితో తరచూ గొడవలు..
సేనాలీకి తన తల్లితో తరచూ గొడవలు జరిగేవని ప్రాథమిక విచారణలో తేలింది. ఈసారి గొడవ జరుగుతున్న సమయంలో ఆమె తల్లి నిద్రమాత్రలు వేసుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో ఆగ్రహానికి గురైన సోనాలి తన తల్లికి 20 నిద్రమాత్రలు తినిపించింది.
కొంతసేపటికి కడుపునొప్పి రావడంతో తల్లి కేకలు వేసింది. దాన్ని చూసి ఆగ్రహించిన సేనాలీ.. తల్లి గొంతుకోసి హత్య చేసింది. ఆపై పోలీసులు సేనాలీని అరెస్టు చేశారు, పోలీసులు ఈ విషయాన్ని మరింత లోతుగా విచారిస్తున్నారు.